మార్చ్ 25: ఐపీఎల్ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విధ్వంసక ఓపెనర్ క్రిస్గేల్ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. రాజస్థాన్ తో పంజాబ్ కింగ్స్ లెవన్ జైపూర్ వేదికగా ఇవాళ రాత్రి తలపడబోతున్న మ్యాచ్లో గేల్ మరో ఆరు పరుగులు చేస్తే ఐపీఎల్లో 4వేల పరుగుల మార్క్ని అందుకున్న 9వ క్రికెటర్గా రికార్డ్ల్లో నిలవనున్నాడు. ఇప్పటి వరకూ సురేశ్ రైనా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్, మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే ఐపీఎల్లో 4వేల పరుగులు పూర్తి చేశారు. శనివారం జరిగిన మ్యాచ్లో రైనా.. 5వేల పరుగుల మార్క్ని కూడా అందుకున్న విషయం తెలిసిందే. 2018 ఐపీఎల్లో నిరాశపరిచిన క్రిస్గేల్.. ఇటీవల సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్తో ఫిబ్రవరిలో ముగిసిన వన్డే సిరీస్లో 4 మ్యాచ్లాడిన క్రిస్గేల్ 106 సగటుతో ఏకంగా 424 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫోర్లు.. 39 సిక్సర్లు ఉండటం అతని జోరుకి నిదర్శనం. ఐపీఎల్లోనూ క్రిస్గేల్కి మెరుగైన రికార్డ్ ఉంది. ఇప్పటి వరకూ 112 మ్యాచ్లాడిన ఈ ఓపెనర్.. 41.17 సగటుతో 3,994 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉండగా.. 24 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.