మార్చ్ 25: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నాగ్ పూర్ లోక్ సభ స్థానానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో భారీ ర్యాలీ అనంతరం నితిన్ గడ్కరీ నామినేషన్ ఫిల్ చేశారు. నామినేషన్ సమయంలో నితిన్ గడ్కరీ వెంట మహరాష్ట్ర సీఎం దేవేంద్ర పఢ్నవీస్ కూడా ఉన్నారు. నాగ్ పూర్ నుంచి నితిన్ గడ్కరీ మూడోసారి పోటీ చేస్తున్నారు. ప్రధాని రేసులో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను నితిన్ గడ్కరీ ఖండించారు.