హైదరాబాద్, ఆగస్ట్ 11 : రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ పార్టీ మారుతున్నాడు అంటూ వచ్చే వార్తలను ఆయన ఖండించారు. తనపై కొంతమంది కావాలనే కథనాలు రాస్తున్నారంటూ, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. అంతేకాకుండా, టీఆర్ఎస్ ను వీడేది లేదంటూ ఎన్ని సార్లు స్పష్టం చేసినా.. తిరిగి అవే వార్తలను రాయడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ విషయంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఇష్టానుసారంగా వార్తలను రాసి విలువలను దెబ్బ తీయోద్దంటూ సూచించారు. ఎట్టిపరిస్థితిలోనూ కారు దిగేది లేదంటూ వెల్లడించారు.