ఆఫ్రికా దేశాలకు ఆసరాగా భారత నౌకాదళం

SMTV Desk 2019-03-25 17:18:12  indian navy, africa, idan tsunami

ఆఫ్రికా, మార్చ్ 25: ఆగ్నేయాఫ్రికాలో ఈ నెల 15న ఇడాయ్‌ తుపాను ప్రభావంతో అక్కడి సమీప ప్రదేశాల్లో జన జీవనం అంతా అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ విన్నపం మేరకు తీర ప్రాంతం బెయిరాకు భారత్‌కు చెందిన మూడు నౌకలు చేరుకొని సహాయక చర్యలు అందిస్తున్నాయని విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు భారత నౌకాదళం 192 మందిని కాపాడిందని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 1,381 మందికి సాయం అందిస్తోందని తెలిపింది.