అమరావతి : ఎపిలో నిర్వహించే లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల కోసం పరిశీలకులను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ స్థానాలకు 50 మందిని సాధారణ పరిశీలకులుగా నియమించింది. 25 లోక్సభ స్థానాలకు మరో 25 మంది పరిశీలకులను నియమించింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ పోలీసు పరిశీలకులుగా 13 మంది ఐపిఎస్లను నియమించింది. ఈ నెల 25వ తేదీ నుంచి వీరు రాష్ట్రంలో పర్యటిస్తారు, ఎన్నికల పరిస్థితి, పార్టీ ప్రచారం సరళిని పరిశీలిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వీరు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి వేదికలు అందజేస్తారు.