చంద్రబాబు చెప్పినట్టే ఆ యాక్టర్, పాస్టర్ ఆడుతున్నారు

SMTV Desk 2019-03-25 13:32:12  jagan, chandrababu, paul ka

చిలకలూరుపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్, కేఏపాల్ లక్ష్యంగా విమర్శలు సంధించారు. ఎన్నికల్లో గెలవలేమని చంద్రబాబుకు అర్ధమయ్యింది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఇద్దరిని చంద్రబాబు రంగంలోకి దించారు. చంద్రబాబు చెప్పినట్టే ఆ యాక్టర్, పాస్టర్ ఆడుతున్నారు. చంద్రబాబు చెప్పిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారని జగన్ అన్నారు.

చంద్రబాబు ఎలా చెబితే అలా పవన్ నడుచుకుంటున్నారు. చంద్రబాబుతో నేరుగా పొత్తు పెట్టుకుంటే తనకు కూడా ఓట్లు పడవని తెలిసే పవన్ ఇలా పరోక్షంగా చంద్రబాబుతో కలిసారని జగన్ విమర్శించారు. చంద్రబాబులో కల్మషం లేకపోతే వివేకా హత్య విషయంలో సీబీఐ విచారణకు ఎందుకు అంగీకరించడంలేదని ప్రశ్నించారు.

వైసీపీకి వ్యతిరేకంగా కొత్త కొత్త పార్టీలు తీసుకొస్తున్నారు.. ఆ పార్టీ గుర్తులు, కండువాలు వైసీపీకి దగ్గరగా ఉండేలా చూస్తున్నారు. ఆ పార్టీలకు చంద్రబాబే డబ్బులు అందిస్తున్నారని జగన్ ఆరోపించారు.