మీడియా వాటికి ప్రాధాన్యం ఇవ్వకూడదు : వెంకయ్యనాయుడు

SMTV Desk 2017-08-11 18:01:54  VICE PRESEDENT, VEKAYYA NAYUDU, MEDIA, RAJYASABHA

న్యూఢిల్లీ, ఆగస్ట్ 11 : ఉపరాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టిన అనంతరం వెంకయ్యనాయుడు రాజ్యసభలో తొలి ప్రసంగం చేశారు. రాజ్యసభలో విలువైన సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని పార్టీల సభ్యులు తమకు సమానమేనని, సభలో ఇచ్చిన సమయం ఆధారంగా సభ్యుల౦దరికి మాట్లాడే అవకాశం ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా గురించి మాట్లాడుతూ.. సభలో జరిగే నిర్మాణాత్మకమైన చర్చలను మాత్రమే ప్రసారం చేయాలని అలా కాకుండా కేవలం సంచలనానికి దారి తీస్తూ చెలరేగే వివాదాలను చూపించడం సరికాదంటూ ఆయన విమర్శించాడు.