పంత్ హవా .. ముంబై చిత్తు

SMTV Desk 2019-03-25 13:24:27  Mumbai, Pant

ముంబయి: ఐపిఎల్-12 సీజన్ లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చిత్తుగా ఓడింది. ఢిల్లీ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి 19.2 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. ముంబయి జట్టులో యువరాజ్ సింగ్ (53: 35 బంతుల్లో 5×4, 3×6), కృనాల్ పాండ్య‌ (32: 15 బంతుల్లో 5×4, 1×6), ఓపెనర్ డికాక్ (27: 16 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 14, కీరన్ పొలార్డ్ (21: 13 బంతుల్లో 2×4, 1×6) విఫలమయ్యారు.