కోల్కతా, మార్చ్ 24: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తొలి మ్యాచ్లో కెకెఆర్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెకెఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత సీజన్లో ఫైనల్లో చెన్నై చేతిలో ఓటమితో రన్నరప్తో సరిపెట్టుకున్న సన్రైజర్స్..ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో క్రీజులోకి వెళ్లి కోల్కతాకు 181/3 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. అయితే అనంతరం క్రీజులోకి వెళ్ళిన కోల్కతా జట్టు హైదరాబాద్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెకెఆర్ స్కోరు 183/4. ఆండ్రూ రస్సెల్ 18 బంతుల్లో 49 పరుగులు చేసి కోల్కతా విజయం అందించాడు.