ఆఫ్రికాలో ఘోరం : రెండు తెగల మధ్య పోరు...115 మంది మృతి

SMTV Desk 2019-03-25 13:05:13  africa mali

ఆఫ్రికా, మార్చ్ 24: ఒగౌస్సగౌ గ్రామంలో డోగోన్‌ జాతి వేటగాళ్లు మరోసారి దాడులకు దిగారు. అక్కడి వారిని తుపాకులతో కాల్పులు జరుపుతూ నివాసాలకు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో 115 మంది ఫులానీ తెగ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పశువుల మేత, నీటి విషయంలో ఈ రెండు తెగల మధ్య జరిగిన గొడవలే ప్రాణాలు తీసుకునేదాక వచ్చాయంటున్నారు అధికారులు. ఈ ప్రాంతంలోని జాతివైరాన్ని అల్‌కాయిదా, ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ఉగ్రసంస్థలు పావుగా వాడుకుంటున్నాయంటున్నారు.