ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

SMTV Desk 2019-03-25 12:38:46  Alla Ramakrishna reddy

ఇప్పుడు రానున్న ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా నిలిచిన నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం కూడా ఒకటి.ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచే ఏపీ ముఖ్యంమత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మొదటి సారిగా పోటీ చేయనున్నారు.దీనితో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరికి దక్కుతుందన్న అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అక్కడ వార్ వన్ సైడ్ కానుంది అని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి హితవు పలుకుతున్నారు.

అయితే అక్కడ జనసేన మద్దతుతో సిపిఐ అభ్యర్థి ముప్పాళ నాగేశ్వరరావు కూడా బరిలో ఉన్నారు.అయితే వీరందరిని దాటి తానే గెలవబోతున్నానని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.గతంలో కూడా చంద్రబాబుని ఇక్కడ నుంచి తనపై పోటీ చేసేందుకు కోరారనని కానీ ఆయన చెయ్యలేదని తాను పడిపోతానన్న భయంతోనే ఇప్పుడు నాలా లోకేష్ ని బరిలో దింపారని ఇక లోకేష్ కూడా ఇక్కడ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.