కేసీఆర్, జగన్ లు మాకు మిత్రులే

SMTV Desk 2019-03-25 12:34:56  KCR, Jaga, Piyush

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ నాయకులు తమ ప్రచారాలు తీవ్రం చేశారు. అలాగే తమ మాటల దాడిని, విమర్శలను కూడా పదును పెడుతున్నారు. ఇక ఏపీలో అధికార టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ, మోదీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏ సభ పెట్టినా తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ మోదీకి మిత్రలేనని, వారు ముగ్గురూ కలిసి ఏపీని నాశనం చేయడానికి చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు ఎక్కడ ప్రచారం చేసినా ఇదే అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆరోపణలకు ఊతం ఇచ్చేలా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్‌లో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే కేసీఆర్, జగన్ తమకు మిత్రలేనన్న అర్థం వచ్చేలా గోయల్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, జగన్ మీకు మిత్రులేనా, మీతో కలిసేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానమిస్తూ ‘ఖచ్చితంగా కలుస్తాం.. అదృష్టవశాత్తూ దానిపై ఎలాంటి జీఎస్టీ ఉండదు’ అని వ్యాఖ్యానించారు.