ఏనుగుతో సేల్ఫీ...కాలు కింద వేసి నలిపేసింది

SMTV Desk 2019-03-25 12:34:02  selfie with elephant, tamilnadu

చెన్నై, మార్చ్ 24: తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఓ వ్యక్తి ఏనుగుతో సేల్ఫీ తీసుకోబోయి.. అదే ఏనుగు కాళ్ల కింద నలిగిపోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. పూర్తి వివరాల ప్రకారం నీలగిరి జిల్లా శ్రీదేవి ఆలయ సమీపంలో రెండు ఏనుగులు ఓ చోట ఉన్నాయి. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఏనుగుతో సెల్ఫీకి ప్రయత్నించాడు. అతడు కెమెరా వైపు చూస్తూ సెల్పీ తీసుకోబోయాడు. ఇంతలో ఆ వ్యక్తిని తొండంతో ఏనుగు తన వైపు లాక్కొని కాలుతో తొక్కింది. స్థానికులు ఏనుగును వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఏనుగు వెనక్కి తగ్గలేదు. ఎలాగోలా ఏనుగు బారి నుంచి యువకుడిని కాపాడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించారు.