ఏప్రిల్ 1న మోదీ భారీ బహిరంగ సభ

SMTV Desk 2019-03-25 12:31:12  narendra modi, bjp, loksabha elections

రాజమండ్రి, మార్చ్ 24: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 1వ తేదీన రాజమహేంద్రవరం స్పిన్నింగ్ మిల్లు గ్రౌండ్ లో జరుగాబోయే బహిరంగ సభకు హజరు కానున్నట్లు బిజెపి నేత సోము వీర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్రం ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని, రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరు అయిన్నాయి. కాని చంద్రబాబు 2 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని సోము వీర్రాజు అన్నారు.