యాంకర్ శ్యామల అడిగిన ప్రశ్నకి దిమ్మతిరిగి పోయిన శివాజీ రాజా

SMTV Desk 2019-03-25 12:23:18  Anchor Shyamala, Shivaji Raja,

హైదరాబాద్‌లో నిన్న రాత్రి నిర్వహించిన సూర్యకాంతం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యాంకర్ శ్యామల చేసిన అతి ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిహారిక, రాహుల్ విజయ్ జోడీగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్యామల అత్యుత్సాహం ప్రదర్శించి అతి చేయడంతో ప్రేక్షకులు నివ్వెరపోయారు. ఇక ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో ఓటమి పాలైన శివాజీ రాజా అయితే తెల్లమొహం వేశారు. టైటిల్ కాన్సెప్ట్‌లో భాగంగా ‘మీ జీవితంలో మీరు చూసిన సూర్యకాంతం ఎవరు’? అంటూ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను శ్యామల ప్రశ్నిస్తూ వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది.

అలా అందరినీ అడుగుతూ శివాజీ రాజా వద్దకు వచ్చిన శ్యామల.. మా ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కంగ్రాట్స్ అంటూ మొదలుపెట్టింది. ఆమె వ్యాఖ్యలతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. అంతేకాదు.. ‘మీరు గెలిచిన తర్వాత ఇదే మొదటి ఫంక్షన్ అనుకుంటా’ అనడంతో శివాజీ రాజాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించిన శివాజీరాజా ‘గెలిచింది నేను కాదు తల్లీ.. నేను ఓడిపోయా. నా టీంలో మాత్రం కొందరు గెలిచారు’ అని ఇబ్బంది పడుతూ చెప్పారు. అయినప్పటికీ పట్టించుకోని శ్యామల ‘మీ టీంలో వారు గెలిస్తే మీరు గెలిచినట్టే’ అంటూ తన వెర్రి తనాన్ని బయటపెట్టుకుంది. ఓడిన శివాజీ రాజాకి కంగ్రాట్స్ చెప్పడమే కాకుండా మీరు గెలిచినట్టే అంటూ శ్యామల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.