ఐపీఎల్ టీ-20 లీగ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది బీఎస్ఎన్ఎల్. ఇందులో ఆఫర్స్ డీటెయిల్స్ చూస్తే..
ఐపీఎల్ లీగ్ క్రికెట్ లవర్స్ని తెగ ఉత్సాహపరుస్తోంది. ఈ సమయంలోనే పలు టెలికం సంస్థలు కూడా స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులకు చేరువ కావాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఐపీఎల్ టీ -20 సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ని ప్రకటించింది. తెలంగాణ, ఏపీలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోదారులకు ఎస్టీవీ 199, ఎస్టీవీ 499 ఆఫర్లను తీసుకొచ్చింది. ఒకవేళ ఎస్టీవీ 199ని రీచా్జి చేసుకుంటే.. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ), రోజూ వన్ జీబీ డేటా, క్రికెట్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, ప్రీ అన్లిమిటెడ్ సాంగ్ ఛేంజ్ని 28 రోజుల కాలపరిమితో పొందవచ్చు.
ఇక ఎస్టీవీ 499 రీచార్జిపై వీటన్నిటితో పాటు రోజు వంద ఎస్ఎంఎస్లు, ఫ్రీ అన్లిమిటెడ్ సాంగ్ ఛేంజ్ని 90 రోజుల కాలపరిమితితో పొందవచ్చని తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం తెలిపారు. పూర్తి వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.