వివాదాలు సినిమా విజయాలకు కారణమవుతాయనేది టాలీవుడ్లో కొత్త సూత్రం. తాజాగా బూతు సీన్లతో వివాదాస్పదమైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ మరోసారి దీన్ని రుజువు చేసింది. కంప్లీట్ అండల్ట్ కామెడీ సినిమాగా రూపొందిన ఈ చిత్రం... బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో విజయం దిశగా దూసుకుపోతోంది. ట్రైలర్ నుంచే పెను సంచలనం క్రియేట్ చేసింది ఈ సినిమా. బాలీవుడ్లో మాత్రమే కనిపించేంత బూతు సీన్లను ట్రైలర్లోనే చూపించి, తాము ఏం చూపించబోతున్నామో స్పష్టం చేశాడు డైరెక్టర్. యూత్ను మాత్రమే టార్గెట్ చేసి రూపొందించిన ఈ సినిమా పోస్టర్లపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన రోజున థియేటర్ల దగ్గరికి వెళ్లి, పోస్టర్లు చించి హడావిడి చేశారు కొందరు. అయితే ఇవన్నీ ఈ సినిమాకు అదనపు ప్రమోషన్ను తెచ్చిపెట్టాయి.
అభ్యంతరం తెలిపేంత ఈ సినిమాలో ఏముందనే కుతుహలంతో సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు యువత. ఫలితంగా విడుదలైన మొదటి రోజే రూ.2.50 కోట్ల గ్రాస్ సాధించి రికార్డు క్రియేట్ చేసిందీ చిన్ని సినిమా. అత్యంత తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాకు ఇంత మొత్తం మొదటి రోజే రావడమంటే పెద్ద విషయమనే చెప్పాలి. జెనిలీయా ప్రధాన పాత్రలో రూపొందిన ‘కథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య అరుణ్, ఈ బూతు సినిమాలో హీరోగా నటించాడు. సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వంలో మార్చి 21న విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ యూత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.