తెలంగాణలో లోక్సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్న ఆరుగురు అభ్యర్ధుల జాబితాను బిజెపి శనివారం సాయంత్రం విడుదల చేసింది. దీంతో కలిపి మొత్తం 16 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. మెదక్ అభ్యర్ధి పేరు ఇంకా ప్రకటించవలసి ఉంది.
ఈరోజు ప్రకటించిన జాబితాలో చేవెళ్ల: బి.జనార్థన్, పెద్దపల్లి: ఎస్.కుమార్, హైదరాబాద్: భగవంత్ రావు, ఖమ్మం: వాసుదేవ రావు, ఆదిలాబాద్: సోయం బాబూరావు, జహీరాబాద్: బాణాల లక్ష్మారెడ్డి ఉన్నారు.
గురువారం ప్రకటించిన జాబితాలో సికింద్రాబాద్: కిషన్ రెడ్డి, మల్కాజిగిరి: ఎన్ రామచంద్రరావు, మహబూబ్నగర్: డీకే అరుణ, నిజామాబాద్: డి. అరవింద్, కరీంనగర్: బండి సంజయ్, నల్లగొండ: గార్లపాటి జితేంద్రకుమార్, భువనగిరి: పీవీ శ్యామ్సుందర్ రావు, నాగర్కర్నూల్ (ఎస్సీ): బంగారు శ్రుతి, మహబూబాబాద్: హుస్సేన్నాయక్, వరంగల్: చింతా సాంబమూర్తి ఉన్నారు.