బెంగుళూరు ను చిత్తు చేసిన చెన్నై ..

SMTV Desk 2019-03-25 11:10:15  Chennai, Bangalore,

చెన్నై: ఐపిఎల్ సీజన్12లో ప్రస్తుత ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై ఏడు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో 71 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరికి 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పయి లక్ష్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. చెన్నై స్పిన్నర్లు అద్భుత బౌలింగ్‌తో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. బెంగళూరు జట్టులో పార్థివ్ పటేల్ (29) ఒక్కడే రెండంకెలా స్కోరును అందుకున్నాడు. అంతేగాక రాయల్ ఇన్నింగ్స్‌లో కేవలం మూడు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే నమోదైంది. దీన్ని బట్టి చెన్నై బౌలర్లు ఏ స్థాయిలో ఆధిపత్యం చెలాయించారో ఊహించుకోవచ్చు.