జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు రద్దు

SMTV Desk 2019-03-24 20:32:54  Jet airways, Banks, Debts

మార్చ్ 23: రుణఉబిలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ నెల చివర వరకు ఆ విమాన సంస్థ 13 అంతర్జాతీయ రూట్లలో తమ విమానాలను నిలిపివేసింది. దీంతో మొత్తం జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 54 విమానాలు శాశ్వ‌తంగా గ్రౌండ్ అయ్యాయి. ఢిల్లీ, ముంబై నుంచి విదేశాల‌కు వెళ్లే జెట్ ఎయిర్‌వేస్ విమానాల‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. పుణె టు సింగ‌పూర్‌, పుణు టు అబుదాబి విమానాల‌ను ర‌ద్దు చేశారు. ముంబై టు మాంచెస్ట‌ర్ స‌ర్వీసుల‌ను ఇప్ప‌టికే నిలిపేశారు. న‌రేశ్ గోయ‌ల్‌కు చెందిన జెట్ ఎయిర్‌వేస్ సంస్థ నిధుల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్న‌ది. బెయిల్ఔట్ ప్యాకేజీ కోసం కూడా ఎదురుచూస్తున్న‌ది. కానీ ప‌రిస్థితులు ఎక్క‌డా అనుకూలంగా లేవు. ఆ కంపెనీ ఫ్ల‌యిట్ల స‌ర్వీసు నాలుగో వంతుకు ప‌డిపోయింది. మ‌రోవైపు ఆ సంస్థ పైల‌ట్లు.. ప్ర‌ధాని మోదీతో పాటు పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి సురేశ్ ప్ర‌భుకు తాజాగా లేఖ రాశారు. త‌మ‌కు జీతాలు ఇప్పించాల‌ని వాళ్లు ఆ లేఖ‌లో కోరారు.