మార్చ్ 23: కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఓ సంచలన ప్రకటన చేసింది. ఏప్రిల్ నుంచి వివిధ మోడళ్ల ప్యాసెంజర్ కార్ల ధరలను రూ.25,000 దాకా పెంచుతున్నట్లు తాజాగ ప్రకటించింది. మోడల్ను బట్టి ఈ పెంపు ఉంటుందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా టయోటా, జాగ్వర్ ల్యాండ్ రోవర్ ధరలు పెరుగుతాయని పేర్కొంది. అయితే మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ధరలను పెంచుతున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మూడు నెలల్లోనే టాటా మోటార్స్ కార్ల ధరలను పెంచడం ఇది రెండోసారి. జనవరిలో వివిధ కార్లపై రూ.40 వేల వరకు పెంచిన సంగతి తెలిసిందే. వీటిలో టాటా హారియర్ కారుతోపాటు ఇతర కార్లు కూడా ఉన్నాయి. టాటా మోటర్స్ ప్రస్తుతం 2.36 లక్షల నుంచి ప్రారంభమయ్యే నానో కారు నుంచి రూ. 18.37 లక్షల ధర పలికే ప్రీమియం ఎస్యూవీ హెగ్జా కార్లను విక్రయిస్తోంది.