ఇండోర్ ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ

SMTV Desk 2019-03-23 18:08:51  madhyapradesh, indore, swine flue

భోపాల్, మార్చ్ 23: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 41 మంది మరణించడంతో కలకలం సృష్టిస్తోంది. 644 మంది రోగులను పరీక్షించగా వీరిలో 152 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేలిందంటున్నారు వైద్యులు. ప్రస్తుతం మరో 19 మంది స్వైన్ ఫ్లూతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్వైన్ ఫ్లూ అంటు వ్యాధి కావడంతో ఇండోర్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.