మహిళా కండక్టరుపై ఆటో డ్రైవర్ల దాడి

SMTV Desk 2017-08-11 14:21:56  Tirupati, APSRTC BUS, Taxi,Auto, Drivers Attack, woman Conductor

తిరుపతి, ఆగస్ట్ 11: రోజురోజుకూ ప్రైవేటు వాహనాల డ్రైవర్ల దౌర్జన్యం శృతి మించిపోతుంది. తాజాగా తిరుమల పుణ్యక్షేత్రంకు చేరుకునే యాత్రికుల ప్రధాన రవాణా మార్గంగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భక్తులను ఎక్కించుకునేందుకు ఓ ఆర్టీసీ బస్సును ఆపగా, తమ బేరాలు పోతున్నాయని ఆరోపించిన టాక్సీ, ఆటో డ్రైవర్లు మహిళా కండక్టరుపై దాడికి దిగడం దుమారం రేపింది. ఉదయం రైల్వే స్టేషన్ మీదుగా బస్సు వెళుతూ, ప్రధాన గేటు ముందుకు వచ్చి ఆపగా, ఆ పక్కనే ఉన్న పలువురు ప్రైవేటు వాహనాల డ్రైవర్లు దాడికి దిగారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, అసలేం జరిగిందన్న విషయమై సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.