తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు సీనియర్ తెలంగాణ నేత దేవేందర్ గౌడ్ ను ఆయన నివాసంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి కలిశారు. అయితే ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించాలని కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
అలాగే... పెద్దల నుంచి మద్దతు తీసుకుంటే టీఆర్ఎస్ పై గెలుపొందడం ఈజీ అవుతుందని రేవంత్ తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే ప్రజా గాయకుడు గద్దర్, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాంను కూడా కలిసినట్లు వివరించారు. ఇప్పుడు దేవేందర్ గౌడ్ను కలిశానని అన్నారు. తాను కలిసిన వారంతా సానుకూలంగా స్పందించారని రేవంత్ రెడ్డి వివరించారు.