పార్టీ పేరును మార్చిన మమతా

SMTV Desk 2019-03-23 16:54:52  trinamool congress, congress party, trinamool party, mamata benarje, all india trinamool congress party, trinamool party logo

కోల్‌కతా, మార్చ్ 23: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 21 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి 1998లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ స్థాపించినప్పుడు పార్టీ లోగోలో తృణమూల్ కాంగ్రెస్ అని రాయించారు. కానీ ఇప్పుడు ఆ లోగోలో కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించి.. తృణమూల్‌ను మాత్రమే ఉంచారు. తృణమూల్‌ను ఆకుపచ్చ రంగుతో రాయించగా, ఫ్లవర్స్ వెనుకాల మాత్రం నీలం రంగును ఉంచారు. లోగో మార్పునకు సమయం ఆసన్నమైనందునే మార్చాల్సి వచ్చిందని ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. పార్టీ బ్యానర్లు, పోస్టర్లతో పాటు ఇతర సామాగ్రిపై కేవలం తృణమూల్ అని మాత్రమే రాయించారు.