నయా బ్యాటరీ స్కూటర్...రూ.1100లకే బుకింగ్!

SMTV Desk 2019-03-23 16:44:17   Avan Motors India, trend e bike

మార్చ్ 23: బ్యాటరీ స్కూటర్ల తయారీ సంస్థ అవాన్‌ మోటార్స్‌ ఇండియా మరో కొత్త స్కూటర్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ట్రెండ్‌ ఈ’అనే పేరుతో విడుదలైన ఈ స్కూటర్లో సింగిల్ బ్యాటరీ ఉన్న మోడల్ ధర రూ.56,900 కాగా, డబుల్ బ్యాటరీలు ఉన్నదైతే రూ.81,269గా కంపెనీ నిర్ణయించింది. ‘ట్రెండ్ ఈ’ స్కూటర్ కావాలనుకునే వినయోగదారులు కేవలం రూ.1100లతో బుకింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. లిథియం -ఐయాన్ బ్యాటరీ కలిగిన సింగిల్ బ్యాటరీ మోడల్ గరిష్ఠ వేగం గంటకు 45 కి.మీ. మైలేజీ 60 కి.మీ అందిస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే డబుల్ బ్యాటరీ మోడల్ స్కూటర్ 110 కి.మీ లు ప్రయాణం చేయవచ్చు. ఈ బ్యాటరీని 2-4 గంటల్లో ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. అవాన్ మోటార్స్ బిజినెస్ డెవలప్ మెంట్ హెడ్ పంకజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ ఈ బైక్ హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, కాయిల్ స్ప్రింగ్ రేర్ సస్పెన్షన్ కలిగి ఉంటుంది. అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రేర్ వీల్స్‌పై డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్స్ అమర్చాం. యువ‌తరం ప్రయాణానికి ఈ బైక్ చాలా బాగుంటుంది. ప్రీ బుకింగ్స్ చేసుకున్న వారికి నెలాఖరులోపే అందుబాటులోకి తీసుకొస్తాం.’ అని పేర్కొన్నారు.