శ్రీ రెడ్డి మరో మారు వార్తల్లోకి

SMTV Desk 2019-03-23 13:41:45  Sri reddy,

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి మరో మారు వార్తల్లోకి ఎక్కింది. చాలా రోజులు క్రితమే శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చిన సంగతి తెల్సిందే. ఈ నేపధ్యంలో అంబునగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లోని ప్లాట్ లో ఆమె అద్దెకు ఉంటోంది. తన మేనేజర్ మోహన్‌తో పాటు ఆమె కలిసి ఉంటోంది. కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తుండటంతో పాటు, తన బయోపిక్ రెడ్డీస్ డైరీ కూడా అక్కడే తెరకెక్కుతుండటంతో శ్రీరెడ్డి చెన్నైలోనే ఎక్కువగా ఉంటోంది.

ఇటీవలే హైదరాబాద్ వచ్చిన శ్రీరెడ్డి నిన్ననే చెన్నైకు తిరిగి వెళ్లింది. అయితే నిర్మాత సుబ్రమణి, అయన అసిస్టంట్ గోపీ తన ప్లాట్ కు వచ్చి తనపై దాడికి పాల్పడ్డారని, తనను చంపేస్తామని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. అయితే, తనపై జరిగిన దాడి ఘటనకు గల కారణం గురించి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్ట్ లో వేరే విధంగా పేర్కొంది. తమిళనాడులో పొలాచ్చి సెక్స్ రాకెట్ వ్యవహారం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాను స్పందించడం వల్లే ఈ దాడి జరిగిందని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, హైదరాబాద్ పోలీసులు నిర్మాత సుబ్రమణిని ఇటీవలే ఓ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడం, ఆ తర్వాత విడుదల కావడం జరిగింది. సుబ్రమణి అరెస్టు కావడానికి శ్రీరెడ్డే కారణమని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.