బస్సులో చెలరేగిన మంటలు

SMTV Desk 2019-03-23 12:22:27  bejing

బీజింగ్‌: చైనాలోని ఓ పారిశ్రామిక వాడలో జరిగిన పేలుడు ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ పర్యాటక బస్సులో మంటలు చెలరేగి 26 మంది చనిపోయిన సంఘటనా చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మధ్య చైనాలోని హ్యూనన్‌ ప్రావిన్స్‌ చాంగ్డే పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 56 మంది ఉన్నట్లు సమాచారం. గాయ పడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు గురువారం రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 62కు చేరింది.