మరోసారి ఎగసిన బంగారం, వెండి ధరలు

SMTV Desk 2019-03-23 11:57:02  Gold Rate, Silver rate, Bullion market

మార్చ్ 22: బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.80 పెరిగింది. బంగారం ధరలు రూ.80 పెరగడంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,050 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,880 వద్ద కొనసాగుతోంది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద కొనసాగుతోంది. వారాంతపు డెలివరీ వెండి ధరలు కూడా రూ.246 పెరిగి పతనమై కిలో వెండి ధర రూ.38,126 కి చేరింది. ఇక 100 వెండి నాణేల ధర రూ.1000 పెరిగడంతో.. కొనుగోలు ధర రూ.80,000 ఉండగా.. అమ్మకం ధర రూ.81,000 వద్ద నిలిచాయి.