ఓటేసిన సీఎం చంద్ర‌బాబు..!

SMTV Desk 2019-03-22 17:29:45  Chandrababu, mlc

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ లో ఓటు వేశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.

అయితే కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ నిన్న ద్వివేది తెలిపారు.

అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చామని కూడా వెల్లడించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ బూత్‌కు వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలిస్తామన్నారు. మూడు నియోజకవర్గాల్లో మొత్తం 94మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి చెప్పారు. కాగా ఈరోజు ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వివరించారు.