దెబ్బకు దెబ్బ : పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ జగన్

SMTV Desk 2019-03-22 17:27:34  Pawan Kalyan, Jagan

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడ ఉన్న మూడు పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసారు.నిన్న గాజువాకలో నామినేషన్ వేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేసుకున్న సంగతి తెలిసినదే..ఆ ప్రచారంలో భాగంగా పవన్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.దీనికి రెప్లైగా ఈ రోజు జగన్ తన కంచుకోట పులివెందులలో తన ప్రచారాన్ని ప్రారంభించారు.

అక్కడ జరిగిన ప్రచారంలో జగన్ పవన్ , ఇటీవలే ఆ పార్టీలోకి చేరిన జేడీ లక్ష్మీనారాయణలపై సంచలన వ్యాఖ్యలు చేసారు.పవన్ కళ్యాణ్ చంద్రబాబు పార్ట్నర్ అని నిన్న చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసారు.అలాగే అప్పటి వరకు చంద్రబాబుతో కలిసి ఉన్న జేడీ కూడా చంద్రబాబు ప్లాన్ లో భాగంగానే జనసేన పార్టీలో చేరారని,వీరంతా కలిసి నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.అలాగే నిన్న జరిగినటువంటి పవన్ సభలో తెలుగుదేశం పార్టీ జెండాలు దర్శనమిచ్చాయి,వీరిద్దరూ కలిసే ఉన్నారు అన్నదానికి ఇక దీనికన్నా అసలు సాక్ష్యం ఏం కావాలి అంటూ జగన్ తన స్పందనను ఘాటుగా తెలిపారు.