షాపింగ్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ఓ యువతి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో కిడ్నాప్కు గురైంది. నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. షాపింగ్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న ఆమెను కార్లో వచ్చిన కొందరు దుండగులు వెంబడించి, బలవంతంగా కార్లో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.