హైదరాబాద్, ఆగస్ట్ 10 : సీనియర్ కథానాయికలు చాలా మంది తమ వయసుకు తగిన పాత్రలను ఎంచుకొని రీ ఎంట్రీ ఇవ్వడం మామూలే. తాజాగా వాణీ విశ్వనాథ్ కూడా ఆ జాబితాలో చేరారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో నటించిన కథానాయికగా వాణీ విశ్వనాథ్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే బోయపాటి శ్రీను సినిమా "జయ జానకి నాయక" చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. రకుల్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వాణీ, సినిమాలో కనిపించేది నాలుగు సీన్లలో మాత్రమేనట. కాని ఈ చిత్రానికి గాను ఆమె 40 లక్షలను పారితోషికంగా తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే అంత పారితోషకం ఇవ్వవలసి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.