మహబూబ్ నగర్ లో కలకలం .. ప్రియుడితో కలిసి ఆత్మహత్య!

SMTV Desk 2019-03-22 12:34:37  Mahabubnagar, susicde

ఈ రోజుల్లో ప్రేమ అనేది కామన్ అయిపోయింది .. విచ్చల విడిగా తిరగడం, పెళ్లి చేసుకోకుండా పెద్ద వాళ్ళు నిశ్చయించిన పెళ్లిని చేసుకోవడం తద్వారా వాళ్ళ జీవితానికే ముప్పు తెచ్చుకుంటున్నారు .. ఇక వివరాల్లోకి వెళితే .. సుమారు పది నెలల క్రితం వివాహం చేసుకున్న ఓ యువతి, తన పాత ప్రియుడిని వదిలి ఉండలేక, అతనితో పాటు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ సమీపంలోని అన్నాసాగర్ లో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన నర్సింహ, మణెమ్మల కుమార్తె రామేశ్వరి (25), అదే గ్రామానికి చెందిన నాగరాజు (31) నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయిన రామేశ్వరి, పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించి, తాళి కట్టించుకుంది. పెళ్లయిన రెండు నెలలకే పుట్టింటికి వచ్చిన ఆమె, భర్తతో కాపురం చేసేందుకు వెళ్లబోనని తెగేసి చెప్పింది. ఆపై తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నాల్లో ఉండటంతో, అప్పటికీ ప్రియుడి గురించి చెప్పలేకపోయిన ఆమె, ప్రియుడు నాగరాజుకు విషయం చెప్పుకుంది. ఇద్దరూ తనువు చాలించాలన్న నిర్ణయానికి వచ్చి, బుధవారం నాడు మోతుకుంట చెరువు సమీపానికి వెళ్లి, పురుగుల మందు తాగారు. గురువారం నాడు అటుగా వచ్చిన స్థానికులకు, ఇద్దరూ విగత జీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.