దేశంలో కొత్త ప్రభుత్వం నెలకొంటుందని హోలీ సందర్భంగా ఆశిస్తున్నా

SMTV Desk 2019-03-22 12:04:46  bsp party chief mayavati, sp party chief akhilesh yadav, loksabha elections

ల‌క్నో, మార్చ్ 21: రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పందిస్తూ ఇది బహుజన్‌ సమాజ్‌ పార్టీ అంతర్గత నిర్ణయం. ఈ ఎన్నికల్లో పొత్తులో ఉన్న ఇతర అభ్యర్థుల గెలుపునకు కూడా తమ అధినేత్రి మాయావతి కృషి చేస్తారని బీఎస్పీ తెలిపింది. ఇది మంచి నిర్ణయం. బీఎస్పీ, ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పొత్తు మంచి భావాలు, ఆలోచనలతో కూడిన కూటమి. ఇది సాధారణ ప్రజల కూటమి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏర్పాటైన పొత్తు ఇది దేశాన్ని ముందుకు నడిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…దేశంలో కొత్త ప్రభుత్వం నెలకొంటుందని ఈ రంగుల పండుగ హోలీ సందర్భంగా తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.