పెరిగిన బంగారం ధర!

SMTV Desk 2017-08-10 17:20:58  gold rate increase, global market

న్యూఢిల్లీ, ఆగస్ట్ 10 : అంతర్జాతీయ పరిస్థితులు, ఆభరణాలు తయారు చేయడానికి డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో ఒక్కసారిగా బంగారం ధర అమాంతం రూ.340 పెరిగింది. కాగా ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.29,890గా న‌మోదైంది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి పసిడి ధర తగ్గుతూ వచ్చిన విషయం విధితమే. నాణేల తయారీదారుల నుంచి కూడా బాగా డిమాండ్ పెరగడంతో కిలో వెండి ధ‌ర కూడా రూ.570 పెరిగి మొత్తంగా రూ.40,070కు చేరింది. గ్లోబల్ మార్కెట్లో 0.09శాతం ప‌సిడి ధ‌ర ఔన్సు బంగారం ధర 1,278 డాలర్లుగా న‌మోదైంది.