సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన అందాల భామ అదితిరావు హైదరి, ఇప్పుడు ఏకంగా పోటీ పడి మరీ సమంతనే వెనక్కు నెట్టేసింది. సమ్మోహనం సినిమాతో హిట్ కొట్టిన ఈ భామ రీసెంట్గా అంతరిక్షం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ 26వ చిత్రంలో కథానాయికగా అదితి ఎంపికైందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2018గా ఎంపికైంది. తొలి స్థానం ఈ అమ్మడికి దక్కగా రెండో స్థానంలో ఎఫ్బీబీ కలర్స్ ఫెమీనా మిస్ ఇండియా 2018 శ్రియా రావు నిలిచింది. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంటూ టైమ్స్ గ్రూప్ తయారు చేసిన జాబితాలో సమంత మూడో స్థానంలో నిలిచింది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2017 లో తొలి స్థానం దక్కించుకున్న పూజా హెగ్డేకి ఈ సారి నాలుగో స్థానం దక్కింది. ఐదు రష్మిక, ఎనిమిది కైరా అద్వానీ, తొమ్మిది రకుల్, పదవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది.