కాశ్మీర్, మార్చ్ 21: జమ్మూకాశ్మీర్ లో జవాన్ల మధ్య అంతర్గత పోరులో ముగ్గురు జవాన్లు ప్రాణాలు విడిచారు. ఈ దారుణ సంఘటన బుధవారం అర్థరాత్రి కాశ్మీర్ లో చోటు చేసుకుంది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తోటి జవాన్లతో వాగ్వాదానికి దిగడంతో వారిని తన సర్వీసు రైఫిల్తో కాల్చిచంపాడు. 187వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ అజిత్ కుమార్ కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అర్థరాత్రి జవాన్లతో గొడవ పడ్డ ఆయన ..సహనం కోల్పోయి ముగ్గుర్ని కాల్చి, తానూ ఆత్మహత్యకు యత్నించాడు. కాల్పుల శబ్ధం విన్న అధికారులు బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు జవాన్లు అప్పటికే చనిపోయినట్లు నిర్థారించిన వైద్యులు..అజిత్ కు చికిత్స అందిస్తున్నారు.