కాశ్మీర్, మార్చ్ 21: జమ్మూకాశ్మీర్లో ఎల్వోసీ వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో భారత జవాను మృతి చెందాడు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్లను రంగంలోకి దించిందంటున్నాయి బీఎస్ఎఫ్ వర్గాలు. ఉరి, పూంచ్, రాజౌరి, నౌషెరా, సుందర్ బనీ తదితర 12 ప్రాంతాల్లో పాక్ ఆయుధాలతో కూడిన డ్రోన్లను రంగంలోకి దించిందని పేర్కొంది. ఈ నేపధ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ డ్రోన్ల ఎత్తుగడను చిత్తు చేసేందుకు చర్యలు చేపట్టాయి.