నడవలేని స్థితిలో పోసాని.

SMTV Desk 2019-03-21 17:57:35  posani, posani krishna murali

రెండ్రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద నటుడు పోసాని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే అందుకు సమాధానంగా తనకు ఆరోగ్యం సరిగా లేదని నడవలేని పరిస్థితుల్లో యశోదా ఆసుపత్రిలో ఉన్నానని ఆయన చెప్పినట్టు పొద్దున్న నుండీ ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన మరోమారు చంద్రబాబు మీదా, తెలుగుదేశం మీదా విరుచుకు పడ్డారు. ఈసారి ఆయన ఆంద్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు తాను నడవలేని పరిస్థితుల్లో యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో వచ్చిందని అది వాస్తవం కాదని పోసాని తెలిపారు.

పోసాని చంద్రబాబును అప్రతిష్ట పాలుచేసేలా సినిమా తీశారని ఓ టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అందుకే ఎన్నికల సంఘం తనకు నోటీసులు జారీచేసిందని దానికి సమాధానంగా నేను ఎలాంటి సినిమా తీయలేదని జవాబిచ్చానని కానీ వాళ్లు మీరు వ్యక్తిగతంగా వస్తే బాగుంటుందని చెప్పడంతో నా ఆరోగ్యం బాలేదు, ప్రస్తుతం సరిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని జవాబిచ్చినట్లు పోసాని చెప్పారు. తనకు ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారని పోసాని తెలిపారు. తనకు నడవడానికి ఇబ్బంది ఉందనీ తాను ఎన్నికల సంఘానికి పంపానన్నారు. అయితే తాను ఈసీకి రాసిన లేఖ కాపీలు మీడియా చేతికి చేరాయని దీంతో ఈ మొత్తం వ్యవహారానికి కలరింగ్ వేసిన ఏబీఎన్ పోసాని చంద్రబాబుకు కులాన్ని ఆపాదించడంతోఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. తాను నడవలేని స్థితిలో ఉన్నందున విచారణకు రాలేనని పోసాని జవాబిచ్చారని కథనం ప్రసారం చేసిందని మండిపడ్డారు.