నాగబాబు జనసేన తరపున నరసాపురం పార్లమెంట్ నుండి పోటీచేయనున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో నటుడు శివాజీ రాజా వైసీపీ లోకి చేరుతున్నట్లు ప్రకటన చేసారు ఈమధ్యే జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ చేతిలో శివాజీరాజా ప్యానల్ ఓటమి చెందింది. నాగబాబు ప్రత్యక్షంగా నరేష్ కు మద్దతివ్వడం వలెనే తాను ఓడిపోయానన్న శివాజీరాజా నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతానని మీడియా సాక్షిగా అన్నాడు.
ఆ మాట ప్రకారమే ఆయన వైకాపాలో చేరుతున్నాడట. అది కూడా 24వ తేదీన నరసాపురంలో జగన్ చేపట్టనున్న ఎన్నికల ప్రచారంలోనే చేరుతాడట. ఇదంతా నరసాపురం నుండి పోటీకి దిగుతున్న నాగబాబుని ఓడించడానికేనని అంటున్నారు. వైకాపా తరపున నరసాపురంలో రఘురామరాజు బరిలో ఉన్నారు. శివాజీరాజా ఆయన కోసం ప్రచారం చేసి నాగబాబుని దెబ్బకొట్టాలని చూస్తున్నాడట. జగన్ సైతం రాజుల కమ్యూనిటీ ప్రభావం ఎక్కువగా ఉన్న నరసాపురంలో శివాజీరాజా చేత నాగబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తే మేలు జరుగుతుందని భావిస్తున్నాడట.