జనసేన పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కూడా తన అభ్యర్ధులను నిలబెడుతున్న సంగతి తెలిసిందే. మల్కాజ్గిరి, సికిందరాబాద్ నియోజకవర్గాలకు బి. మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్ లను అభ్యర్ధులుగా ప్రకటించిన జనసేన తాజాగా మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి డాక్టర్ భాస్కర్ భూక్యా నాయ్యక్ పోటీ చేయబోతున్నట్లు బుదవారం ప్రకటించింది.