గత కొన్ని రోజులు నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపు నుంచి పోటీ చేయనున్న శాసన సభ మరియు లోక్ సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసినదే..ఇప్పటి వరకు పవన్ తన పార్టీ తరపు నుంచి పోటీ చెయ్యబోయే అభ్యర్థుల జాబితాను నాలుగు విడతల్లో విడుదల చేసారు.తాజాగా గురువారం తెల్లవారు జామున వారి పార్టీ నుంచి పోటీ చేసే ఐదవ జాబితాను కూడా విడుదల చేసారు.ఈ జాబితాలో 4 లోక్ సభ మరియు 16 శాసన సభ అభ్యర్థులు ఉన్నారని తెలియజేసారు,ఇది వరకే తెలంగాణాలో ఒక శాసన సభ అభ్యర్థిని ప్రకటించిన పవన్ ఈ జాబితాలో కూడా ఒక అభ్యర్థిని ప్రకటించడం విశేషం.ఈ జాబితాను ఒకసారి పరిశీలిద్దాం.
తెలంగాణా లోక్ సభ అభ్యర్థి
మహబూబాబాద్ : డా.భూక్యా భాస్కర్ నాయక్
లోక్ సభ అభ్యర్థులు
విజయనగరం: శ్రీ ముక్కా శ్రీనివాసరావు
కాకినాడ: శ్రీ జ్యోతుల వెంకటేశ్వరరావు
గుంటూరు: శ్రీ బి.శ్రీనివాస్
నంద్యాల: శ్రీ ఎస్.పి.వై.రెడ్డి
శాసనసభ అభ్యర్థులు
1) సాలూరు: శ్రీమతి బోనెల గోవిందమ్మ
2) పార్వతీపురం : శ్రీ గొంగడ గౌరీ శంకరరావు
3) చీపురుపల్లి: శ్రీ మైలపల్లి శ్రీనివాసరావు
4) విజయనగరం: డా.పెదమజ్జి హరిబాబు
5) బొబ్బిలి: శ్రీ గిరదా అప్పలస్వామి
6) పిఠాపురం: శ్రీమతి మాకినీడు శేషుకుమారి
7) కొత్తపేట: శ్రీ బండారు శ్రీనివాసరావు
8) రామచంద్రపురం: శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్
9) జగ్గంపేట: శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర రావు
10) నూజివీడు: శ్రీ బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
11) మైలవరం: శ్రీ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
12) సత్తెనపల్లి: శ్రీ వై.వెంకటేశ్వర రెడ్డి
13) పెదకూరపాడు: శ్రీమతి పుట్టి సామ్రాజ్యం
14) తిరుపతి: శ్రీ చదలవాడ కృష్ణమూర్తి
15) శ్రీకాళహస్తి: శ్రీమతి వినుత నగరం
16) గుంతకల్లు: శ్రీ మధుసూదన్ గుప్తా