శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ లోనూ ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలుపుతో శుభారంభం చేసింది. తొలి టీ20లో సఫారీలు ‘సూపర్ ఓవర్’లో లంకను ఓడించి.. 1-0తో సిరీస్ లో ఆధిక్యం సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో తొలుత కమిందు మెండిస్ (41) రాణించడంతో.. లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. పెహ్లుక్వాయో 3 వికెట్లు తీశాడు. ఛేదనలో డేవిడ్ మిల్లర్ (41), డుప్లెసిస్ (21) మెరవడంతో సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేయడంతో.. స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. మిల్లర్ (1, 1, 6, 4, 2) విజృంభణతో సౌతాఫ్రికా 14 రన్స్ సాధించింది. తర్వాత ఇమ్రాన్ తాహిర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో.. లంక 6 బంతుల్లో 5 పరుగులే చేసి ఓడింది.