మెదక్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై ఒక్కసారిగా పిడుగు పడటంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం సాయంత్రం తిమ్మనగర్లో చోటు చేసుకుంది.
ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తుండగా వారిపై పిడుగు పడింది. ఆ సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించడంతో గాయాలతో బతికి బయటపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.