పాట్నా సాహిబ్‌ నుంచి శతృఘ్నసిన్హా పోటీ!

SMTV Desk 2019-03-21 15:48:09  Shatrugna sinha

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రెబల్ ఎంపీ శతృఘ్న సిన్హా కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం. సిన్హా కొద్ది రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ అధిష్టానంపై, ప్రధాన మంత్రి మోదీపై విమర్శలు చేస్తున్న విషయం తెలసిందే. దీంతో పార్టీ పెద్దలు సిన్హాకు టికెట్ కేటాయించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ బీజేపీ నుంచి టికెట్ రాకపోతే సిన్హా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజవర్గం నుంచి పోటీలో దిగనున్నట్లు తెలుస్తోంది.

శతృఘ్న 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో పాట్నా సాహిబ్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడే నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ఆయన చాలాసార్లు ప్రస్తావించారు. కానీ సిన్హాకు బీజేపీ టికెట్ ఇస్తుందా? ఒకవేళ ఇవ్వకపోతే.. ఆయన కాంగ్రెస్‌కు వెళ్లి పోటీ చేస్తారా? అనే ప్రశ్న అందరిలో నెలకొంది. అయితే ఈసారి పాట్నా సాహిబ్ నుంచి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బరిలో దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీపై, ప్రధాని మోదీపై శతృఘ్న ఎన్ని విమర్శలు చేసినా.. బీజేపీ అతనిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.