ట్రెండ్ అవుతున్న మహర్షి మానియా

SMTV Desk 2019-03-21 15:03:47  Trend Maharshi,

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం “మహర్షి” వంశీ పైడిపల్లి మరియు మహేష్ ల కాంబినేషన్లో ఇది మొట్ట మొదటి సినిమా కావడం వలన అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.ఈ సినిమాకి సంబందించి టీజర్ విడుదల విషయంలో రెండు రోజులు వినిపిస్తున్నాయి.ఒకటి ఈ నెల హోలీ ఒకటి మరోటి వచ్చే నెల 6న ఉగాది ఈ రెండు రోజుల్లో ఒక రోజు ఈ సినిమా టీజర్ రానుంది అని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది.

అయితే ఇదే సందర్భంలో ఈ సినిమా విడుదలకు ఇంకా 50 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మహేష్ అభిమానులు అప్పుడే “మహర్షి” మ్యానియా సోషల్ మీడియాలో మొదలు పెట్టేసి అతిపెద్ద టట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.మహర్షి మ్యానియా ఇన్ 50 డేస్ అనే పేరిట హాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ సినిమాకు జరగని విధంగా లక్షల్లో ట్వీట్లు రీట్వీట్లతో ట్విట్టర్ ను మోగించేస్తూ తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 9 న విడుదల కానుంది.