బెంగళూరు, మార్చ్ 20: ప్రముఖ సినీ నటి సుమలత 17వ లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు సుమలత సోమవారం స్పష్టం చేశారు. అయితే అంబరీష్ మాండ్య లోక్ సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. సుమలత తన మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసే ముందు ఛాముండేశ్వరీ ఆలయాన్ని సుమలత సందర్శించారు. తన కుమారుడితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.