చెన్నై, మార్చ్ 20: ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ ఇవాళ లోకసభ ఎన్నికల కోసం పోటీ పడే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొమ్మిది 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రస్తుతం కమల్ పార్టీ తరపున లోక్సభకు పోటీ చేస్తున్న వారి లిస్టు ఇదే. బెనజీర్(కన్యాకుమారి), ఎంఏఎస్ సుబ్రమణ్యం(పుదుచ్చరి), ఆనంద రాజా(తిరుచ్చి), రవి(చిదంబరం), రిఫాయుద్దీన్(మైలదుద్దురై), ఎస్ రాధాకృష్ణణ్(తేని), ఏజీ మౌర్య(చెన్నై నార్త్), కమేలా నసీర్(చెన్నై సెంట్రల్), శివకుమార్(శ్రీపెరంబదూర్).