టర్కీ, మార్చ్ 20: బుధవారం ఉదయం టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.4గా నమోదైందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ టర్కీలో ఈ భూకంపం వచ్చినట్టు యురోపియన్ మానిటరింగ్ సర్వీస్ తెలిపింది. అసిపేయమ్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ భూకంపం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఇంకా దీనిపై సమాచారం తెలియాల్సి ఉంది.